అమరావతి : కర్నూలు జిల్లాలో ఓ పోలీసు అధికారి లంచం తీసుకుంటు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డాడు. జిల్లాలోని సి. బెళగల్ పోలీస్స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శివాంజల్ తన ఇంటి వద్ద బాధితుడి వద్ద నుంచి 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
స్థలం విషయంలో బాధితుడు ఎస్సైను సంప్రదించగా తాను పరిష్కరిస్తానని అందుకు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వ్యూహం ప్రకారం ఎస్సై ఇంటి వద్ద బాధితుడు రూ. 50వేలు ఇస్తుండగానే అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు రెడ్హ్యండెడ్గా పట్టుకుని కేసు నమోదు చేశారు.