అమరావతి : విడాకుల కేసు వ్యవహారంలో కోర్టుకు వచ్చిన భార్య, అత్త,మామలపై ఓ ఎస్సై దాడి చేసిన ఘటన బుధవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగింది. గుంటూరులోని గురజాలలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న నాగార్జున 2017లో లావణ్య అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే భర్త నాగార్జున వివాహం తరువాత మరో యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతుండడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో ఎస్సై 2019లో భార్య లావణ్యతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. కేసు విషయమై ఆత్మకూరుకు వచ్చిన భార్య లావణ్య, అత్త, మామలపై దాడి చేసి గాయపర్చగా భార్య ఆత్మకూరు దవాఖానలో చికిత్సపొందుతుంది.