తిరుమల : తిరుమల(Tirumala) శ్రీవారి లక్ష్మీకాసులహారం (Kasulaharam)శోభాయాత్ర సోమవారం వైభవంగా జరిగింది. ముందుగా శ్రీవారి లక్ష్మీకాసులహారాన్ని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనానికి తీసుకొచ్చారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుంచి అట్టహాసంగా ప్రారంభమైన శోభాయాత్ర పలు వీధుల గుండా కొనసాగింది.
అక్కడి నుంచి కోదండరామాలయం, రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం మీదుగా శ్రీనివాసమంగాపురానికి చేరుకుంది. భక్తుల భజనలు, కోలాటాలతో శోభాయాత్ర కోలాహలంగా యాత్రసాగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ (TTD) జేఈవో వీరబ్రహ్మం దంపతులు పాల్గొన్నారు.
కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రగిరి ఎమ్మెల్యే
శ్రీనివాస మంగాపురం కళ్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(MLA Bhasker Reddy) దంపతులు, టీటీడీ బోర్డు సభ్యులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు (Silk Clothes) సమర్పించారు.