Srisailam | శ్రీశైల క్షేత్రంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల ప్రచారానికే పెద్దపీట వేయనున్నట్లు ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరూపాక్షయ్య, మధుసూదన్రెడ్డి చెప్పారు. శ్రీశైలంలో జరిగే అధ్యాత్మిక కార్యక్రమాల విశ్వవ్యాప్తానికి అవసరమైన ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. వారు శుక్రవారం శ్రీశైలం మహాక్షేత్రంలోని గంగాసదన్లో గల శ్రీశైల టీవీ చానెల్ పనితీరును అకస్మికంగా తనిఖీచేశారు. కార్యక్రమాల ప్రసార వివరాలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
శ్రీశైలం మహా క్షేత్రానికి వచ్చే యాత్రికుల అవసరాలకనుగుణంగా దేవస్థానం చేపట్టాల్సిన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లతామని మఠం విరూపాక్షయ్య, మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే గంగా సదన్లో సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ నిర్వహణ, వసతి గదులలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను స్వయంగా తనిఖీ చేసి ఏఈవో మోహన్తో చర్చించారు.