Shirdi-Vishaka Rail | ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో తృటిలో ప్రమాదం తప్పింది. షిర్డీ నుంచి విశాఖపట్నం వెళ్లే షిర్డీ రైలు శనివారం సాయంత్రం ఐదు గంటల టైంలో ఏలూరు రైల్వేస్టేషన్ రెండో ప్లాట్ఫామ్పైకి చేరింది. అలా రైలు స్టేషన్లోకి వచ్చీ రావడంతోనే ఎస్2, ఎస్3 బోగీల మధ్య కప్లింగ్ విరిగిపోయింది. దీంతో రెండు బోగీల మధ్య లింక్ తెగిపోయింది. దీంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమైంది. వెంటనే షిర్డీ రైలును నిలిపేశారు.
కప్లింగ్ విరిగిపోయిన బోగీని పక్కకు తప్పించారు. ఆ ప్రయాణికుల కోసం మరో బోగిని అమర్చారు. మరమ్మతుల తర్వాత రాత్రి 7. 20 గంటల తర్వాత రైలు విశాఖ పట్నం బయలుదేరి వెళ్లింది. ఘోర ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు చెప్పారు. ప్రయాణికులు సురక్షితం అని తెలిపారు.