అమరావతి : ఏపీలోని పులివెందులలో ఘోరం జరిగింది. ఓ ట్రాన్స్జెండర్పై కొంతమంది లైంగికదాడికి పాల్పడ్డారు. పులివెందుల నుంచి కదిరికి వెళ్ళేరోడ్డులో ఆమెపై దాడి చేసి చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు. తనకు పోలీసులు న్యాయం చేయడం లేదంటూ తోటి ట్రాన్స్జెండర్లలతో కలిసి ఆమె నిరసన వ్యక్తం చేసింది. చివరకు దిశయాప్కు కాల్ చేసిన తర్వాత పోలీసులు స్పందించారని బాధితురాలు తెలిపింది. తనపై 15 మంది వరకు దాడి చేసి లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె వివరించింది.
నిందితులను గుర్తించి అరెస్టు చేయాలని ట్రాన్స్జెండర్లు డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పులివెందుల పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.