అమరావతి : అగ్నిపథ్పై యువత ఆందోళన దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ, రేపు మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. ఇవాళ విశాఖ నుంచి గుంటూరుకు వెళ్లే ఎక్స్ప్రెస్(17240), రేపు గుంటూరు నుంచి విశాఖకు వెళ్లే (17239) ఎక్స్ప్రెస్ రైలును రైల్వే అధికారులు రద్దు చేశారు.అదేవిధంగా విశాఖ నుంచి కాకినాకు వెళ్లే (17268), రేపు కాకినాడ నుంచి విశాఖకు వెళ్లే (17267) ఎక్స్ప్రెస్ రైలును రద్దు చేశారు.
ఇవాళ విశాఖ నుంచి రాయగఢ్కు వెళ్లే (18528) ఎక్స్ప్రెస్ రైలును , రేపు రాయగఢ్ నుంచి విశాఖ కు వెళ్లే (18527) రైలును ముందు జాగ్రర్తగా రద్దు చేశారు. రేపు షాలిమర్ నుంచి సికింద్రాబాద్ ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్(18045)ను రద్దు చేశారు.