అమరావతి : భక్తుల కొంగు బంగారంలా విలసిల్లుతున్న కాకినాడ(Kakinada) జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరంలో(Annavaram temple) నూతన ధ్వజస్థంభాన్ని ప్రతిష్టించారు. నెల్లూరుకు చెందిన ఓ దాత సహకారంతో నూతన బంగారు ధ్వజస్తంభం(Golden flagpole) ఏర్పాటు చేశారు. సుమారు 105 కేజీల బంగారం, సుమారు రూ.2కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ చైర్మన్ రోహిత్, ఈవో రామచంద్ర మోహన్, తదితరులు పాల్గొన్నారు.