అమరావతి : అమరావతి రాజధానిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ వైఖరి తీవ్రంగా నష్టం చేసే విధంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం సీఆర్డీఏ బిల్లు రద్దుపై ఆయన స్పందించారు. ప్రభుత్వ విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్లోని యువతకు ఉపాధి అవకాశాలు తగ్గడంతో పాటు రాష్ట్ర ఆదాయనికి భారీగా లోటు ఏర్పడుతుందని అన్నారు.
ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్విటర్ ద్వారా స్పందించారు. ‘‘ మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే. ఇల్లు ఇక్కడే కట్టా, అమరావతే రాజధానే అంటూ ఎన్నికలకు వెళ్లిన వ్యక్తి.. మూడురాజధానులు చేయమని ప్రజలు తీర్పు ఇచ్చారనడం హైలైట్. మురుగు బుర్రలకి మెరుగైన ఆలోచనలు రావడం ఎప్పటికీ జరగని పని లోకేశ్ అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేశారని మండిపడ్డారు.