అమరావతి : ఏపీలోని పల్నాడు జిల్లాలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని పులిపాడు మండలానికి చెందిన బస్సు బోల్తా పడింది. దైద గ్రామం నుంచి 30 మంది విద్యార్థులతో కూడిన బస్సు గురజాలకు వెళ్తుండగా అదుపుతప్పి పంటపొలాల్లో బోల్తా పడింది. స్థానికులు వెంటనే స్పందించి బస్సులో చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీశారు.
బస్సులో ఉన్న 10 మంది విద్యార్థులకు గాయాలు కాగా వారిని హుటాహుటినా చికిత్స కోసం గురజాల ఆస్పత్రికి తరలించారు. బస్సు బోల్తా విషాయాన్ని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో అడిగి తెలుసుకున్నారు.