అమరావతి : ఏపీలోని నెల్లూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది . స్కూల్ బస్సు కాలువలో పడగా అందులో ఉన్న 30 మందిని స్థానికులు కాపాడారు . జిల్లాలోని సంగం మండలానికి చెందిన స్కూల్ బస్సులో 30 మంది సిబ్బంది నెల్లూరులో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా అరవపాలెం వద్ద ప్రమాదవశాత్తు సదరన్ ఛానల్ కాలువలో బోల్తా పడింది. స్థానికులు వెంటన గమనించి వారిని సురక్షితంగా బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఆరుగురికి స్వయల్ప గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు.