Keshineni Vs Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన ట్వీట్లు కలకలకం రేపాయి. ఢిల్లీలో చంద్రబాబు పర్యటనను కేశినేని నాని ఎద్దేవా చేసినట్లు ఆ ట్వీట్లు ఉన్నాయి. ఈ ట్వీట్లతో కూడిన ప్రచారాన్ని కేశినేని నాని కార్యాలయం ఖండించింది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ట్వీట్లు.. తన పేరుతో ఖాతా క్రియేట్ చేసి సృష్టించిన తప్పుడు ప్రచారం అని ఎంపీ కేశినేని నాని కార్యాలయం తెలిపింది. ఈ విషయమై ఎంపీ నానికి సంబంధం లేకుండా ఫొటో, పేరుతో నకిలీ ఖాతా క్రియేట్ చేశారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని ఎంపీ కార్యాలయం వెల్లడించింది.
ఎంపీ కేశినేని నాని పేరిట నకిలీ ఖాతా సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కార్యాలయం తెలిపింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని ఎంపీ కేశినేని నాని విజ్ఞప్తి చేశారు.