తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి యున్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 60,157 మంది భక్తులు దర్శించుకోగా 31,445 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా టీటీడీ హుండీకి రూ. 4 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.