తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని టీటీడీ(TTD) అధికారులు వివరించారు. శ్రీవారి సర్వదర్శనానికి రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. నిన్న స్వామివారిని 57,441 మంది భక్తులు దర్శించుకోగా 20,878 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ. 3.66 కోట్లు వచ్చిందని వివరించారు. శ్రీవారి భక్తులు టీటీడీ పేరిట ఉన్న నకిలీ వెబ్సైట్ల కారణంగా మోసపోకూడదనే ఉద్దేశంతో టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevasthanams.ap.gov.in లో మాత్రమే ఆర్జితసేవలు, దర్శనం, విరాళాలు, వసతి బుక్ చేసుకోవాలని భక్తులను కోరారు.