అమరావతి : కాకినాడ జిల్లా సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నిన్న రాత్రి ఇంట్లోనే సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించలేదు. రివాల్వర్ మిస్ ఫైర్ కావడంతోనే ఎస్ఐ మృతి చెందాడని పోలీసులు ఉన్నతాధికారులు అంటున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించారు.
ఎస్ఐ గోపాలకృష్ణ స్వస్థలం విజయవాడలోని జగ్గయ్య చెరువు. గోపాలకృష్ణకు పావనితో ఐదేండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.. పాప వయసు 3 ఏండ్లు, బాబు వయసు ఏడాది. గోపాలకృష్ణ మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 2014 బ్యాచ్లో ఎస్ఐగా సెలక్ట్ అయినా గోపాలకృష్ణ.. కాకినాడలో ట్రాఫిక్ ఎస్ఐగా విధులు నిర్వర్తించారు. ఏడాది క్రితం లా అండ్ ఆర్డర్ ఎస్ఐగా బదిలీ అయ్యారు.