తిరుమల : తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. సంక్రాంతి (Sankranthi ) పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో తిరుమలలోని 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 86,107 మంది భక్తులు దర్శించుకోగా 29,849 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.13 కోట్లు వచ్చిందని వెల్లడించారు.