అమరావతి : విశాఖలో ఆరోగ్య సేవ లో రంగంలో విశేష సేవలందిస్తున్న రైట్ కేర్ హోమ్ హెల్త్ కేర్ సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, వైయస్సార్ సీపీ మహిళా నాయకురాలు పేడాడ రమణికుమారి,24 వ వార్డు కార్పొరేటర్ పద్మా రెడ్డిలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా టీపీటీ కాలనీ లో నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు. ముగ్గుల పోటీలో గెలిచిన మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైట్ కేర్ హోమ్ హెల్త్ కేర్ జోగేష్ కుమార్,శోభారాణి,సుశీల,కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.