అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు(Chandra Babu) హయాంలో దోపిడి పాలన కొనసాగిందని, జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని ఏపీ ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna reddy) ఆరోపించారు. గురువారం తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ సీఎం జగన్(YS Jagan) పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో వైఎస్ జగన్ పాలన పారదదర్శకంగా జరుగుతుందని, తండ్రికి మించిన తనయుడుగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. ప్రజలకు పాలనను చేరవేశారని, ప్రతి గ్రామంలోనే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆస్పత్రులు అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు మారీచశక్తులు మళ్లీ ఏకం అయ్యాయని దుయ్యబట్టారు.
ప్రముఖుల శుభాకాంక్షలు
బర్త్డే సందర్భంగా వైఎస్ జగన్కు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ(Modi), జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, హీరో నాగార్జున పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండ నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.