అమరావతి : రైతుల మేలు కోసం నిర్మించాల్సిన రైతు భరోసా కేంద్రాలను ఏపీ ప్రభుత్వం దళారుల జేబులు నింపుతుందని జనసేన (Janasena ) రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆరోపించారు. శుక్రవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో 10వేల ఆర్బీసీ కేంద్రాల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం కేంద్రం నుంచి రూ. 2,300 కోట్లను తీసుకొచ్చిందని పేర్కొన్నారు.
ఆర్బీసీ కేంద్రాలు అసంపూర్తిగా నిర్మించి దళారుల జేబులు నింపిందని విమర్శించారు. ఐదేళ్లలో రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకు కేవలం రూ.156 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. ఇప్పటికీ రాష్ట్రంలో అనేక ఆర్బీసీ కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని వివరించారు. అద్దెలు కూడా చెల్లించడం లేదని వివరించారు. ఈ కేంద్రాల వల్ల రైతులకు మేలు జరుగక నష్టపోతున్నారని ఆయన అన్నారు. రైతులకు ఎక్కువ ధరకు ఎరువులు, విత్తనాలు అమ్ముతున్నారని పేర్కొన్నారు.