ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సుల ఛార్జీలు పెంచుతున్నట్లు ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమల రావు బుధవారం ప్రకటించారు. డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో డీజిల్ సెస్ రూపంలో టిక్కెట్ ధరల పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఇకపై పల్లె వెలుగులో 2 రూపాయలు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో 5 రూపాయలు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. ఇకపై గురువారం నుంచి పల్లెవెలుగులో కనీస టిక్కెట్ ధర 10 రూపాయలుగా ఉంటుందని ఆయన ప్రకటించారు.
డీజిల్ రేటు దాదాపు 60 శాతం మేర పెరిగిందని, నష్టాలను భరించడం సంస్థ వల్ల సాధ్యం కావడం లేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే డీజిల్ సెస్ విధిస్తున్నామని ఆ సంస్థ ఎండీ తెలిపారు. ఇవి పూర్తిగా డీజిల్ సెస్ మాత్రమేనని, టిక్కెట్ ధరల పెంపు మాత్రం కాదని వివరణ ఇచ్చారు. గత రెండేళ్లలో ఆర్టీసీ ఆదాయం 5,680 కోట్లకు తగ్గిపోయిందని, నష్టాలను భరించడం సాధ్యం కావడం లేదని తెలిపారు. ఈ డీజిల్ సెస్ పెంపు వల్ల ఆర్టీసీకి 720 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని