అమరావతి : ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని భీమడోలు మండలం పూళ్ల వద్ద అతివేగంగా వచ్చిన ఏపీ ఆర్టీసీ బస్ ఆగిఉన్న రెండు ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
గాయపడ్డ వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలోని అద్దంకి-నార్కట్ పల్లి జాతీయ రహదారిపై జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో కారు ఢీకొని గుంజా నరసింహారావు (28) అనే యువకుడు మృతి చెందాడు.