అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందిన కుటుంబాలకు సీఎం జగన్ సంతాపం తెలిపారు. జరిగిన ఘటన దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియాను అందజేయాలని అధికారులకు ఆదేశించారు. గాయపడ్డ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్కు ఆదేశించారు.
జంగారెడ్డి గూడెం, జిల్లేరు వద్ద వంతెన రెయిలింగ్ను బస్సు ఢీకొట్టడంతో అదుపు తప్పి వాగులో పడిపోయిన తొమ్మిది మంది చనిపోగా మరో ఆరుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మిగతా ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఈ బస్సులో 47 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలియజేశారు. మరణించిన 9మందిలో ఐదుగురు మహిళలే ఉన్నారు.