అమరావతి : నూతన సంవత్సరం తొలిరోజున తిరుమల తిరుపతి దేవస్థానానినికి రూ. 2. 15 కోట్లు కానుకల రూపేణా ఆదాయం వచ్చింది . శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు 36, 560 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
వీరిలో సినీ, రాజకీయ ప్రముఖులు, జమ్ము, కశ్మీర్ లెఫ్నినెంట్ గవర్నర్, అధికారులు వీఐపీ దర్శన వేళలో స్వామివారిని దర్శించుకున్నారు. 14, 084 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. కొవిడ్ నేపథ్యంలో భక్తులు నిబంధనలు పాటించాలని టీటీడీ అధికారులు వెల్లడించారు.