అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని రెండు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరికొందరి కి తీవ్రగాయాలయ్యాయి. కృష్ణా జిల్లా గుడివాడ నందమూరి అడ్డరోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎదురెదురుగా రెండు బైకులు ఢీకోగా వారు ప్రాణాలు కోల్పోయ్యారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది .
అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం జుంజు రాంపల్లి వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడి 9 మందికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో క్షతగాత్రులను రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.