అమరావతి : ఏపీలోని రెండు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందగా మరి కొందరికి గాయాలు అయ్యాయి. కాకినాడ జిల్లా(Kakinada District) తొండంగి మండలం కొత్త ముసలయ్యపేట వద్ద ద్విచక్రవాహనం(Two wheeler) ట్రాక్టర్ను ఢీ కొనగా ముగ్గురు మృతి చెందారు. ఒంటిమామిడి నుంచి శ్రీరాంపురం వైపు వెళ్తున్న ద్విచక్రవాహనం ట్రాక్టర్ను ఢీ కొనగా ఘటనాస్థలిలో ఇద్దరు మృతి చెందగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులు యు కొత్తపల్లి మండలం శ్రీరాంపురం వాసులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మృతదేహాలను ఆస్పత్రికి తలరించినట్లు వెల్లడించారు.
గుంటూరు ఏఎన్యూ ఎదురుగా గుంటూరు నుంచి విజయవాడ మార్గంలో వెళ్తున్న కంటైనర్ లారీ(Container Loory) జాతీయ రహదారిపై అదుపుతప్పి అవతలి రోడ్డులో వెళ్లున్న మరో లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందగా కంటైనర్ లారీ డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకుపోయాడు. పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని కంటైనర్ లారీలో ఇరుక్కున్న డ్రైవర్ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.