అమరావతి : ఏపీలోని అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ( Road Accident ) లో ఇద్దరు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని ఓబులవారిపల్లె మండలం చిన్న ఓరంపాడు వద్ద టాటాఏస్( Tata Ace) ట్రాక్టర్ ( Tractor) ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్లో ఉన్న నరసింహులు(60), శంకరమ్మ(50) మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
మృతులు మండలంలోని కటికంవారిపల్లె వాసులుగా గుర్తించారు. వీరంతా మదనపల్లె బోయకొండ గంగమ్మ గుడికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ( Police ) ఘటనా స్థలానికి చేరుకుని టాటాఏస్ డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను , క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.