అమరావతి : ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఆమదాలవలస మండలం మందడిలో వేగంగా వచ్చిన లారీ ఉపాధి హామీ కూలీలపై దూసుకెళ్లింది. దీంతో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా నంద్యాల జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాపిలి మండలం నేరేడుచర్ల వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో నేరేడుచర్లకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు.