అమరావతి : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో సంఘటనా స్థలంలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బుధవారం ఉదయం ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంలో గాయపడ్డ ఒకరిని కావలి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.
ఘటనలో కారు డ్రైవర్తో పాటు యజమాని శ్రీనివాసచారి (58) అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక వైపు కూర్చున్న రాజ్యలక్ష్మి (55) అనే మహిళలకు తీవ్ర గాయాలుకావడంతో కావలి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. మృతులను గుడివాడ సమీపంలో మిట్టకూరు ప్రాంతవాసులుగా గుర్తించగా.. తిరుపతి వెళ్లి తిరిగి వస్తుండగా సమయంలో ఘటన జరిగింది.