ఏపీలోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఉరవకొండ మండలం బుదగవి వద్ద కారు, లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న బాలుడు, ఆరుగురు మహిళలు సహా 9 మంది మృతి చెందారు. మృతులంతా కుటుంబ సభ్యులు, బంధువులుగా గుర్తించారు. కర్ణాటకలోన బళ్లారిలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా ఉరవకొండ మండలం నిమ్మగల్లు వాసులుగా గుర్తించారు.