తిరుపతి : ఏపీలోని తిరుపతి(Tirupati) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరి కొందరికి గాయాలయ్యాయి. నారాయణవనం మండలం సముదాయం వద్ద ప్రైవేట్ కళాశాల బస్ కారును ఢీ కొనగా ప్రమాదం జరిగింది . కారులో ఉన్న నలుగురు మృతి చెందగా మరో మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి. కళాశాల బస్సులో ఉన్న విద్యార్థులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.
నెల్లూరు(Nellore) జిల్లా కావలి మండలం మద్దూరుపాడు వద్ద జరిగిన మరో ఘటనలో ముగ్గురు చనిపోయారు. జాతీయ రహదారిపై ఆగివున్న లారీని తిరుపతి నుంచి విజయవాడకు వెళ్తున్న కారు ఢీకొనగా కారులో ఉన్న ముగ్గురు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.