అమరావతి : అమరావతి : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ఆటోను ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద జాతీయ రహదారిపై కారు, ఆటో ఎదురెదురుగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారు. కారులో ఉన్న ఇద్దరు, ఆటోలో ఉన్న 5గురిలో ఇద్దరు చనిపోయారు.
మృతులు గుంటూరు జిల్లా రామనాగేశ్వర్రావు, వెంకటేశ్వర్లు, మార్కపురానికి చెందిన షేక్బాబు,అభినయ్లుగా గుర్తించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గాయపడ్డ క్షతగాత్రులను స్థానికులు హుటాహుటినా మార్కాపురం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.