గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో కారు అదుపు తప్పి, చెరువులోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మరణించారు. ఈ మృతులంతా విస్సన్నపేట మండలానికి చెందిన వారుగా పేర్కొంటున్నారు. మరోవైపు కారు అద్దాలను పగులగొట్టి, స్థానికులు ఆ మృతదేహాలను బయటికి తీశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.