అమరావతి : అనంతపురం(Anantapuram) జిల్లా కేంద్రంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident) తీవ్రంగా గాయపడ్డ ఏఆర్ కానిస్టేబుల్(AR Constable ) చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనంతపురం నగర శివారులోని నేషనల్ పార్క్ వద్ద 44వ జాతీయ రహదారిపై బైక్పై వెళ్తున్న ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్కుమార్, అతడి భార్య అనితను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ అంబులెన్స్ వచ్చేసరికి కోమాలోకి వెళ్లగా, తీవ్రంగా గాయపడ్డ భార్యను ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమించడంతో బెంగళూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్సను ప్రారంభించారు. అయితే చికిత్స పొందుతూ గురువారం మృతి చెందగా అతడి భార్య అనిత కోమాలోకి వెళ్లిందని వైద్యులు తెలిపారు. వైద్యం సరిగా అందకనే మృతి చెందారని బంధువుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైద్యులు సకాలంలో స్పందించి ఉంటే కానిస్టేబుల్ బతికేవాడని వైద్యులతో వాగ్వాదం పెట్టుకున్నారు. అనంతపురం వైద్యులు ఆక్సిజన్ అమర్చకుండా బెంగళూరుకు తరలించే ప్రయత్నం చేశారని బంధువుల ఆరోపించారు.