అమరావతి: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తల్లిదండ్రులు (Rishi Sunak’s Parents), అత్త సుధా మూర్తి కలిసి ఆంధ్రప్రదేశ్లోని ఒక ఆలయాన్ని సందర్శించారు. రిషి సునాక్ తండ్రి యశ్వీర్ సునాక్, తల్లి ఉషా సునాక్ బుధవారం మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శించారు. రిషి సునాక్ అత్త సుధా మూర్తి కూడా వీరి వెంట ఉన్నారు. వారంతా కలిసి రాఘవేంద్ర స్వామి మఠంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శాలువాలతో వారిని సత్కరించారు.
కాగా, రాఘవేంద్ర స్వామి మఠం అధికారిక ఫేస్బుక్లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ‘బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తండ్రి యశ్వీర్ సునాక్, తల్లి ఉషా సునాక్ శ్రీ క్షేత్రమైన మంత్రాలయాన్ని ఇవాళ సందర్శించారు. ఇన్ఫోసిస్కు చెందిన సుధా నారాయణ మూర్తి కూడా వారితో కలిసి రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు’ అని అందులో పేర్కొన్నారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు ఇచ్చి వారిని ఆశీర్వదించిన ఫొటోలను కూడా పోస్ట్ చేశారు.
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తన భార్య అక్షతా మూర్తితో కలిసి ఇటీవల భారత్ వచ్చి జీ20 సమ్మిట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ దంపతులు ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
Watch: Rishi Sunak’s Parents, Mother-In-Law Sudha Murty Visit Andhra Pradesh Temple https://t.co/rh3PYtYEmL pic.twitter.com/3q7iBGGwkb
— NDTV (@ndtv) September 13, 2023