వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి టీడీపీ కోవర్టుగా కాంగ్రెస్లో ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ఎదగాలంటే పార్టీ సిద్ధాంతాల ప్రకారం ముందుకెళ్లాలని, ఇతర పార్టీలకు కోర్టుల్లాగా పనిచేయకూడదని సూచించారు. తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, జగన్.. తన ఇంట్లో చర్చలు జరిపారన్న ఆరోపణలను ఆమె ఖండించారు. తన ఇంటికి జగన్ ఎప్పుడు వచ్చారో చెప్పాలని డిమాండ్చేశారు. బీజేపీ నాయకులు అలాం టి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు, లోకేశ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండు రాష్ర్టాల మధ్య జలవివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదే అని రోజా స్పష్టంచేశారు.