అమరావతి : పల్నాడు జిల్లా పిడుగురాళ్ల రైల్వే క్వార్టర్స్లో విషాదం చోటు చేసుకుంది. రైల్వే రిటైర్ట్ హెడ్ కానిస్టేబుల్ సత్యవర్ధన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 45 రోజుల క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.