అమరావతి : ఆపదలో వరాలిచ్చి ఆదుకునే అమ్మవారిగా ప్రసిద్ధికెక్కిన ఇంద్రకీలాద్రిపై ఆంక్షలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఆలయ నిర్వాహకుల వల్ల భక్తులు ఇబ్బందులు పడుతుండగా తాజాగా ఆలయంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది తప్పనిసరిగా ఆంక్షలు పాటించాల్సిందే అంటూ ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం కలిగిస్తోంది.
విజయవాడలోని దుర్గా ఆలయంలో పని చేసే ఉద్యోగులు, సిబ్బంది ఇక నుంచి తెలుపు రంగు చొక్కా, పంచె ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. కట్టకపోతే రూ. 200 జరిమానా విధించారు. ఐడీ కార్డు లేకపోతే రూ. 100 జరిమానా విధిస్తామని ఈఓ బ్రమరాంబ ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు ఉల్లంఘించి మూడుసార్లు జరిమానాలు చెల్లించిన వారికి ఇంక్రిమెంట్ కట్ చేస్తామని ఆమె హెచ్చరించారు. దేవస్థానం అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు డ్రెస్ కోడ్ పాటించడం, ఐడీ కార్డు ధరించడం, బయోమెట్రిక్ హాజరుపై ఈఓ అధికారికంగా సర్క్యులర్ జారీ చేశారు.