అమరావతి : ఏలూరు జిల్లాలో రిమాండ్లో ఉన్న ఓ ఖైదీ ఆస్పత్రి నుంచి పారిపోయాడు. ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో వైసీపీ నాయకుడు గంజి ప్రసాద్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న రవితేజ జిల్లా కారాగారంలో రిమాండ్ ఖైదీగా శిక్షను అనుభవిస్తున్నాడు.
కొద్ది రోజులుగా నిందితుడు రవితేజ అనారోగ్యంతో జిల్లా కేంద్రంలోని ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సెంట్రీగా ఉన్న పోలీసుల కళ్లుగప్పి రవితేజ తెల్లవారుజామున పారిపోయాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు ప్రారంభించారు.