అమరావతి : ఏపీ-కర్ణాటక సరిహద్దులో నిలిచిపోయిన నైరుతి రుతుపవనాల్లో కదలిక మొదలు కావడంతో ఏపీలోని పలు జిల్లాలో వర్షాలు(Rains) ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా రెండు వారాలుగా అధిక టెంపరేచర్తో తల్లడిల్లిన విజయవాడ ప్రజలకు మంగళవారం భారీ వర్షంతో కొంత ఉపశమనం కలిగించింది. భారీ వర్షంతో నగరంలోని రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
రుతు పవనాల ప్రభావంతో ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాలు దక్షిణభారతంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించడం వల్ల రాగల మూడురోజులు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు పడవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Meteorological Center, )వెల్లడించింది.