అమరావతి : ఆంధ్రప్రదేశ్లో నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలతో నష్టపోయిన జిల్లాలకు తక్షణ సహాయంగా ప్రభుత్వం రూ. 7కోట్లను విడుదల చేసింది. పంట, ఆస్తి, ప్రాణ నష్టానికి చెందిన ప్రాథమిక అంచనాలను ప్రభుత్వం వెల్లడించింది. వర్షాలు, వరదల వల్ల చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలోని 172 మండలాల్లో వర్షాల ప్రభావం పడిందని తెలియజేసింది.
వరదల వల్ల 24 మంది చనిపోగా మరో 17 మంది గల్లంతయ్యారని పేర్కొంది. 23,345 హెక్టార్లలో పంట నష్టం జరుగగా, వీటిలో 19,644 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు తమ అంచనాల్లో వెల్లడించారు.