అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వారిలో ముగ్గురికి ఏపీ హైకోర్టు బెయిల్ తిరస్కరించింది. ప్రధాన నిందితులు దేవిరెడ్డి శివశంకరరెడ్డి, గజ్జల ఉమా మహేశ్వరరెడ్డి, సునీల్ యాదవ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. అయితే తమకు బెయిల్ మంజూరు చేయాలని కడప కోర్టులో పిటిషన్ను వేయగా కోర్టు తిరస్కరించింది.
దీంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ పిటిషన్ను ఏపీ హైకోర్టు పరిశీలించింది. బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని సీబీఐ తరుఫున న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇప్పటికే ఈ కేసులో ఛార్జీషీటు వేశారని, పూర్తి సమాచారం సేకరించిన తరువాత కూడా జైలులో ఉంచడం ఎంతవరకు సమంజసమంటూ నిందితుల తరఫు లాయర్లు పేర్కొన్నారు.
అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వ్యతిరేకించిన సీబీఐ లాయర్ చెన్నకేశవులువ్యతిరేకించడంతో ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు నిందితుల బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది.