తిరుమల : తిరుమల(Tirumala ) లో భక్తుల రద్దీ తగ్గింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తిరుమలకు చేరుకున్నారు. టోకెన్లు(Tokens) ఉన్న భక్తులకు కొద్ది నిమిషాల్లోనే దర్శనం అవుతుండగా టోకెన్లు లేని భక్తులకు8 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) అవుతుందని టీటీడీ అధికారులు(TTD) వివరించారు. నిన్న 77,483 మంది భక్తులు దర్శించుకోగా 19,276 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3 కోట్లు వచ్చిందన్నారు.