తిరుమల : తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ తగ్గింది . కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 65,146 మంది భక్తులు దర్శించుకోగా 25,306 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా హుండీకి రూ. 3.02 కోట్లు ఆదాయం (Hundi income) వచ్చిందని వివరించారు.
మే 22న తిరుమలలో శ్రీ నృసింహ జయంతి
తిరుమల శ్రీవారి ఆలయంలో మే 22న నృసింహ జయంతి జరుగనుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగ నరసింహస్వామివారి మూలమూర్తికి అర్చకులు ప్రత్యేక అభిషేకం చేస్తారని వివరించారు.