తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టోకెన్లు లేని భక్తులకు బుధవారం 6 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలిగిందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 63,251 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 20,989 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ. 4.14 ఆదాయం వచ్చిందని వెల్లడించారు.