తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారిని దర్శించుకునేందుకు 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. వీరికి 6 గంటల్లో దర్శనం అవుతుందని టీటీడీ అధికార వర్గాలు వెల్లడించాయి. నిన్న స్వామివారిని 74,297 మంది భక్తులు దర్శించు కోగా27, 317 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.96 కోట్లు వచ్చిందని తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.