తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఒకటే కంపార్టమెంట్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచియున్నారు. వీరికి ఆరుగంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 64,163 మంది భక్తులు దర్శించుకోగా 23,709 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.36 కోట్లు వచ్చిందని తెలిపారు.