అమరావతి : అన్నమయ్య జిల్లాలో పోలీసులపై ఎర్రచందనం స్మగర్లు దాడికి పాల్పడ్డారు. జిల్లాలోని పీలేరు మండలం చీపాటివారిపల్లె వద్ద అటవి ప్రాంతంలో కూంబింగ్ చేపట్టిన పోలీసులకు ఎర్రచందనం స్మగర్లు, కూలీలు తారాస పడ్డారు. లొంగిపోవాలని పోలీసుల చేసిన హెచ్చరికలు పట్టించుకోకుండా వారిపై రాళ్లు, గొడ్డళ్లు, వేటకొడవళ్లతో దాడికి యత్నించారు. చివరకు పోలీసులు 17 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులకు పట్టుబడిని వారిలో తిరుపతికి చెందిన అంతరాష్ట్ర స్మగ్లర్ అయ్యప్పన్ కూడా ఉన్నారు. అయ్యప్పన్పై వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో 23 కేసులు ఉన్నాయని జిల్లా ఎస్పీ ఫకీరప్ప మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్రాజు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ. 20 లక్షలు విలువైన వాహనాలు, మరో 10 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.