తిరుమల : ఈనెల 14న గీతా జయంతి సందర్భంగా సంపూర్ణ భగవద్గీత అఖండ పారాయణం తిరుమల నాదనీరాజనం వేదికపై నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. మంగళవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఐదు గంటల పాటు భగవద్గీతలోని 18 అధ్యాయాల్లో 700 శ్లోకాలు నిరంతరాయంగా కాశీపతి పారాయణం , కుప్పా విశ్వనాధ శాస్త్రీ వ్యాఖ్యానం చేస్తారని తెలిపారు.
అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణ దారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రీయ పండితులు, టీటీడి వేదపండితులు తదితరులు పాల్గొంటారని వివరించారు.