అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యవహరంపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి విరుచు కుపడ్డారు. లిక్కర్ స్కాంలో తన కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించిన ప్రతిపక్ష పార్టీలను దుయ్యబట్టని మంత్రుల వైఖరిని సీఎం తప్పుపట్టారని ఆయన ఇవాళ ఢిల్లీ మీడియా సమావేశంలో ఆరోపించారు. ప్రతి పక్షాల గొంతు నొక్కని మంత్రులను తొలగిస్తానని పరోక్షంగా హెచ్చరించడం జగన్ నైజం బయట పడిందని ఎద్దేవా చేశారు.
అమరావతిపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కోర్టు తీర్పు ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు. గత అసెంబ్లీ సమావేశంలో వైసీపీ నేతలు మాట్లాడిని మాటలకు ఏపీ ప్రజలు తలదించుకున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరబిందో ఎంపీ సాయిరెడ్డికి వియ్యంకుడని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్న విధంగా సీపీఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.