Tirumala | తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి ప్రసాదాల్లో కల్తీ జరగడం విచారమని అన్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూల నాణ్యత సరిగ్గా లేదని గతంలోనే అప్పటి చైర్మన్, ఈవో దృష్టికి తీసుకెళ్లానని రమణ దీక్షితులు తెలిపారు. ప్రసాదాల పరిమాణాలు కూడా సరిగ్గా లేవని ఫిర్యాదు చేశానని అన్నారు. కానీ తన తోటి అర్చకుల సహకారం అందించకపోవడంతో.. తనది ఒంటరి పోరాటం అయ్యిందని అన్నారు. దీంతో తన పోరాటానికి ఫలితం లేకుండా పోయిందని అన్నారు. దీనివల్ల ఐదేళ్లు మహాపాపం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలను ప్రక్షాళన చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. దానికి తగ్గట్టుగానే చర్యలు తీసుకున్నారని తెలిపారు. అయితే లడ్డూలో తయారీలో కల్తీ జరగడం అనేది అనుకోకుండా బయటపడిందని అన్నారు. దీనికి కూడా పరిహారంగా కర్ణాటక డైరీ నుంచి నందిని నెయ్యిని తిరిగి తీసుకొచ్చి స్వామివారికి ప్రసాదాలు తయారు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని అన్నారు.
సీఎం చంద్రబాబు ఆదేశాలతో తిరుమలలో ప్రక్షాళన జరుగుతోంది. ప్రస్తుతం శుద్ధమైన ఆవు నెయ్యితో ప్రసాదాలు చేయడం హర్షణీయం. ఆగమం పైన పట్టు ఉన్నవారికి స్వామివారి సేవ చేసే అవకాశం సీఎం కల్పించాలి
• టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు#IdhiManchiPrabhutvam#NaraChandraBabuNaidu… pic.twitter.com/avoGywYKc6
— Telugu Desam Party (@JaiTDP) September 20, 2024
ఈ సందర్భంగానే ఏపీ సీఎం చంద్రబాబుకు రమణ దీక్షితులు మరో రిక్వెస్ట్ చేశారు.స్వామివారి మీద విపరీతమైన భక్తి, ఆగమ శాస్త్రాల మీద, మన సంప్రదాయాల మీద గౌరవం ఉన్న వారికి తిరుమలలో సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు.